Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కోల్ బెల్ట్
ఆర్థిక ఇబ్బందులకు తోడు ఫైనాన్స్ వారి ఒత్తిళ్లు భరించలేక లారీ ఓనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్-భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోరచపల్లికి చెందిన నరెడ్ల సుధాకర్రెడ్డి(34) ఆరునెలల కిందట సెకండ్హ్యాండ్ లారీని ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రెండో కిస్తీ డబ్బులు కట్టలేదు. మూడో కిస్తీ కూడా దగ్గరపడింది. అలాగే, మార్చి ఫైనాన్సియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో ఫైనాన్స్ వారు ఒత్తిళ్లకు గురి చేశారు. దీంతో కిస్తీలు ఎలా కట్టాలో తెలియక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనోవేదనకు గురై ఉరేసుకున్నాడు. సుధాకర్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారు రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.