Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ కోదండరాం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ...ఆ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల రిటర్నంగ్ అధికారి సత్యనారాయణకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎల్ విశ్వేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శి గంగపురం వెంకట్రెడ్డి ఒక సెట్, ప్రధాన కార్యదర్శి ధర్మర్జున్, పల్లె వినరు మరో సెట్ను సమర్పించారు. ఈ విషయాన్ని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ బద్రోద్దీన్ ప్రకటించారు.