Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మరింత దిగజారాయని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో అధికార ప్రతినిధి కల్వ సుజాతతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. మూడు రోజులుగా రాష్ట్రంలో తమాషా కార్యక్రమం జరుగుతున్నదని చెప్పారు. టీిఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారు అనే విధంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మహిళా బందు కాదనీ, మహిళా రాబంధ అని ఎద్దేవా చేశారు.