Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి శనివారం తన కార్యాలయానికి వచ్చి బాధ్యతలను చేపట్టారు. ఇంట్లో ప్రమాదవశాత్తు పడిపోయిన కారణంగా ఎడమ భుజానికి తీవ్ర గాయమై ఆయన గతనెల 18 నుంచి మెడికల్ లీవ్ తీసుకున్నారు. ఈనెల 4 వరకు ఆయన సెలవుపై ఉన్నారు. ఈ మధ్యలో కొందరు రాజకీయ ప్రముఖులు తనను బలవంతంగా ప్రభుత్వం సెలవుపై పంపించినట్టు అవాస్తవాలు ప్రచారం చేశారంటూ వారి తీరును ఖండించారు. తిరిగి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డిని కలిసి పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు అభినందనలు తెలిపారు. కాగా, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ కుమార్లతో సమావేశమైన మహేందర్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతల తాజా పరిస్థితిని సమీక్షించారు.