Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి
- సైకిల్పై నుంచి కిందపడగా..మీదినుంచి వెళ్లిన బైక్
నవతెలంగాణ-పెద్ద శంకరంపేట్
పాఠశాలకు సైకిల్ పై వెళ్తున్న ఓ విద్యార్థి.. అదుపుతప్పి కిందపడగా.. ఎదురుగా వస్తున్న బైక్ అతని మీది నుంచి పోవడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారులో శనివారం జరిగింది. పేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..టెంకటి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సాయికిరణ్(13) పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే.. శనివారం సైకిల్పై పాఠశాలకు బయల్దేరాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడిపోగా.. ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్ అతని మీదినుంచి వెళ్లింది. తీవ్రగాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.