Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ కార్యదర్శి విజయలక్ష్మి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ద్వేషాన్ని విడనాడాలనీ, స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం పోరాడాలని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి బివి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'రాజ్యాంగాన్ని రక్షించుకుందాం- మహిళా హక్కులను కాపాడుకుందాం' అనే పేరుతో సోమవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి కె రజని, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షులు పి ప్రేంపావని, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎన్ జ్యోతి, నాయకులు సదాలక్ష్మి, ఛాయాదేవి, ఎన్ కరుణకుమారి, ఏఐటీయూసీ నాయకులు ఎం లక్ష్మిబాయి, హసీనాబేగం తదితరులు పాల్గొన్నారు.