Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు 10
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల పదో తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.3 వేలతో ఈ ఫీజు చెల్లింపునకు అవకాశముందని తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు విద్యార్థుల నుంచి ఫీజు తీసుకోవాలని కోరారు.