Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ యువత సంక్షేమాన్ని, నిరుద్యోగులను విస్మరించిందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) అఖిల భారత ఉపాధ్యక్షులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతిపై ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కానీ యువతకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల అంశాన్ని బడ్జెట్లో కనీసం ప్రస్తావించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.