Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజక వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్లో తగిన విధంగా కేటాయింపులు లేక పోవడం అన్యాయమని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య సోమవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్ధికి కెవలం రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఇంత తక్కువ బడ్జెట్తో రజకుల అభివద్ధి ఎలా సాధ్యమో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో సేవా వృత్తుల్లో ప్రధానమైన రజక వృత్తిదారులకు అన్యాయం జరిగిందని తెలిపారు. సంక్షేమ రుణాలు, అధునాతన దోబీఘాట్ల బీమా పథకానికి కనీస కేటాయింపులు లేకపోవడం చూస్తుంటే రజకుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు ఉందనేది అర్థమవుతున్నదని విమర్శించారు. నాయి బ్రాహ్మణ, వడ్డెర, విశ్వకర్మ ,మేదరి, శాలివాహన పూసల,వాల్మీకి భట్రాజు తదితర 11 ఫెడరేషన్లకు, అత్యంత వెనుకబడ్డ (ఎంబీసీ) కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించలేదని తెలిపారు. అత్యంత వెనుకబడ్డ తరగతులను విస్మరించటం తగదని పేర్కొన్నారు.