Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈనెల 15 వరకు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) నిర్ణయించింది. ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభవాయిదా బుధవారానికి వాయిదా పడింది. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఏసీలో సమావేశాల నిర్వహణపై మంత్రులు, ప్రతిపక్షాలతో చర్చించారు. అందులో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏడు రోజుల పాటు శాసనసభ సమా వేశాలు జరగనున్నాయి. ఈనెల తొమ్మిదిన బడ్జెట్పై సాధారణ చర్చ 10, 11, 12, 14 తేదీల్లో పద్దులపై చర్చించనున్నారు. 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. మంగళవారం మహిళా దినోత్సవం నేపథ్యంలో సెలవు ప్రకటించారు. అలాగే ఈనెల 13 ఆదివారం కావడంతో ఆరోజు కూడా సెలవుగానే పరగణించాలని బీఏసీ నిర్ణయించింది.