Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సింగరేణి రామగుండంలో చోటు చేసుకున్న బొగ్గుగని పైకప్పు కూలిన ప్రమాద దుర్ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో సింగరేణి అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారనే విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటనపై ఆరా తీసారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను ఆదేశించారు. గాయపడిన వారిని తక్షణమే దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు.