Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. పురుషుడితోపాటు అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కుటుంబ అభివృద్ధిలో స్త్రీ పాత్ర ఎంతో గొప్పదనీ, త్యాగపూరితమైందని వివరించారు. మానవ జాతికి మహిళ ఒక వరమని తెలిపారు. మహిళాభ్యుదయానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం పలు పథాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు సామాజిక, ఆర్థిక సాధికారతతోపాటు రాజకీయ సాధికారతను కట్టబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.