Authorization
Thu March 20, 2025 10:40:34 pm
నవతెలంగాణ- యాదాద్రి
యాదాద్రి వార్షిక జాతరలో భాగంగా ఐదో రోజు మంగళవారం యాదగిరి నృరసింహుడు దశావతారాల్లో భాగమైన శ్రీకృష్ణపరమాత్మ (మురళీకృష్ణుడు)గా సందర్శకులకు దర్శనమిచ్చారు. రాత్రి పొన్నవాహనంపై విహరించారు. ఋత్వికులు వేదమంత్రాలతో స్వామిని స్తుతిస్తుండగా, పండితుల పారాయణాలు, సన్నాయి మేళాలు మంగళవాయిద్యాలు మారు మోగుతుండగా బాలాలయంలో స్వామివారిని ఊరేగించారు.