Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే బీజేపీ రాద్ధాంతం చేస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్కసుమన్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెండ్ నిబంధనల ప్రకారమే జరిగిందని సమర్థించుకున్నారు. ఆ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారనీ, పెడధోరణులు మార్చుకోకుంటే రాబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ భాను ప్రసాద్ మాట్లాడుతూ యూపీ ఉన్నావ్ ఘటనలో నిందితులను రక్షించే ప్రయత్నం చేసిన బీజేపీ నేతలు తెలంగాణలో నిందితులపై చర్యలు లేవంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రతి సమస్యకు ప్రభుత్వం వద్ద సమాధానముందని తెలిపారు.