Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హైదరాబాద్ సర్కిల్లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఆనంద శంకర్ జయంత్, ప్రముఖ అర్థోపిడీయషన్ థాయిల్ చిరంజీవి, హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ఎండి, గైనకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ వెంకట గనగ భవానీ హాజరయ్యారు. తమ బ్యాంక్లో పని చేసే మహిళ ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ లేడీస్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.