Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా 91,142 ఉద్యోగ ఖాళీలను భర్తీ గుర్తించి 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసి మిగిలిన 80,039 పోస్టులు నోటిఫికేషన్లు విడుదల చేయాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్కు టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, వి మమత, పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాయకంటి ప్రతాప్, ఎ సత్యనారాయణ,
బీరెల్లి కమలాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. 95 శాతం కొలువులు స్థానికులకే కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఉద్యోగ స్నేహపూర్వక ప్రభుత్వమని చెప్పడం గర్వంగా ఉందని వివరించారు. ఉద్యోగాల భర్తీ ద్వారా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు పనిభారం తగ్గుతుందని తెలిపారు.
పదోన్నతులు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, ఆంగ్ల మాధ్యమం, మన ఊరు-మనబడి కార్యక్రమం అమలుతో వచ్చే విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలలన్నీ మెరుగైన మౌలిక వసతులతో అద్భుత ప్రగతిని సాధిస్తాయని పేర్కొన్నారు.