Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను విశ్వసించే పరిస్థితి లేదని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. గతంలో అనేకసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదికిస్తే, 91 వేలకే నోటిఫికేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సరైంది కాదన్నారు. నిరుద్యోగ భృతి సంగతి ఏంటని ప్రశ్నించారు.