Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
నవతెలంగాణ- నల్లగొండ
వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం నల్లగొండ జిల్లా శేషమ్మగూడెంలో జరిగింది. రూరల్ ఎస్ఐ గోపాలరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్లగొండ మున్సిపాల్టీ పరిధిలోని శేషమ్మగూడెం గ్రామానికి చెందిన దొరేపల్లి భిక్షమయ్య కూతురు దొరేపల్లి ప్రత్యూష(18) పట్టణంలోని సప్తపది జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివేది. అదే గ్రామానికి చెందిన ఒంగూరి అనిల్ ప్రత్యూషను ప్రేమ పేరుతో వేధించాడు. ఇంట్లోకొచ్చి కూడా ఇబ్బంది పెట్టడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని సాయంత్రం ఉరేసుకుంది. అనంతరం నాయనమ్మ గమనించి చుట్టుపక్కల వారిని పిలిచింది. కిందకు దింపి వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.