Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర నిర్ణయాలు ఆక్షేపనీయం
- శాసనసభలో మంత్రి జగదీష్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సింగరేణిని ప్రయివేటీకరణ చేయడం సాధ్యం కాదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంఠంలో ప్రాణమున్నంత వరకు అంతటి సాహసానికి ఒడి గట్టే సాహసం ఎవరూ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు శ్రీధర్ బాబు, బాల్కసుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, గోరుకంటి చందర్ రావు, సండ్ర వెంకట వీరయ్య, రాజగోపాల్ రెడ్డి, చెన్నయ్యలతో పాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సింగరేణిపై లేవనెత్తిన పలు అనుమానాలను మంత్రి జగదీష్ రెడ్డి నివృత్తి చేశారు. ప్రతి సంస్థను ప్రయివేటుపరం చేయాలన్నదే కేంద్రం లక్ష్యంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉనికిని కోల్పోతే ఉద్యోగాలలో రిజర్వేషన్లకు ఎసరు వస్తుందన్నారు. సింగరేణి తెలంగాణ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతం ఉందన్నారు.