Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ చలో అసెంబ్లీ- అరెస్టులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఆ మేరకు పద్దును సవరించాలని కోరింది. ఇదే అంశంపై పీడీఎస్యూ ఆధ్వర్యాన శనివారం అసెంబ్లీని ముట్టడించేందుకు నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి, నగరంలోని బేగంపేట ఠాణాకు తరలించారు. అరెస్టయిన వారిలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.నాగేశ్వరరావు, బోయినపల్లి రాము, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్పన, భాస్కర్, సంధ్య, స్వాతి తదితరులున్నారు.