Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెండేండ్ల నుంచి విధులకు దూరంగా ఉంచిన ఉపాధి హామీ చట్టం ఫీల్డ్ అసిసెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ రావాల్సిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఉద్యోగాలు కోల్పోయా మన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న 69 మంది అసిస్టెంట్ల కుటుంబాలకు ఎక్స్గ్రే షియోనివ్వాలని డిమాండ్ చేసింది. ఇదే అంశాలపై శనివారం ఆ సంఘం నాయకులు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. దాంతో వారందర్నీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఫీల్డ్ అసిసెంట్లందర్నీ విడుదల చేయాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.