Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుత్తా ఎన్నిక లాంఛనమే..!
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శాసనమండలి చైర్మెన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈమేరకు శనివారం అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు నోటిఫికేషన్ను విడుదల చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు చైర్మెన్ ఎన్నిక జరగనుంది. శాసనమండలిలో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మెన్గా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆయన పేరును ఖారారు చేసినట్టు సమాచారం. ఆదివారం మండలి చైర్మెన్గా గుత్తా సుఖేందర్రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం శాసనమండలి సమావేశాలు ప్రొటెం చైర్మెన్ జాఫ్రీ అధ్యక్షతన జరుగుతున్న సంగతి తెలిసిందే.