Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గుపెళ్లలు పడి కార్మికుడికి గాయం
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి రామగుండం డివిజన్ 3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గనిలో శనివారం మళ్లీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైప్లైన్ పనులు నిర్వహిస్తున్న కార్మికుడు రియాజుద్దీన్ గాయపడ్డాడు. గనిలోని నీటి పైపులను తొలగిస్తుండగా బొగ్గు పెళ్ల రియాజుద్దీన్ మెడపై పడింది. అతన్ని తక్షణమే గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంట వెంటనే గనిలో ప్రమాదాలు జరగడం పట్ల కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.