Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజక వృత్తిదారులకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలనీ, వారి సంక్షేమాభివృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో సవరణలు చేయాలని తెలంగాణ రాజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య డిమాండ్ చేశారు. రజకుల ఆత్మగౌరవ సభలో ఆదివారం మెదక్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ రజకుల, నాయీబ్రాహ్మణుల, ఉచిత విద్యుత్కు రూ.300కోట్లు కేటాయించినట్టు చెబుతున్నారని ఇది వాస్తవం కాదని తెలిపారు. బడ్జెట్లో రూ 53.98 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు.