Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో కీలక పాత్ర వహించిన శాసన మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ, రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్-475 బృంద సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో పల్లాను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. దేశంలోనే కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్ల క్రమబద్ధీకరణలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నదని తెలిపారు. ప్రతి ఒక్క కాంటాక్ట్ లెక్చరర్ క్రమబద్ధీకరణకు కృషిచేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జి రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, మనోహర్, డాక్టర్ పడాల జగన్నాథం, ఉదయశ్రీ, శ్రావణ్, సీహెచ్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.