Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐకేపీ వీఓఏలంతా ఈ నెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, ఐకేపీ వీఓఏల సంఘం గౌరవాధ్యక్షులు ఎస్వీ రమ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఐకేపీ విఓఏల సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. ఐకేపీ వీఓఏలు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్తకొత్త నిబంధనలతో సతమతం అవుతున్నారని పేర్కొన్నారు. విఓఏలకు వేతనాలు పెంచి, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీఓఏల సమస్యల పరిష్కారం కోసం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీల్లో జరుగు దేశవ్యాప్త సమ్మెలో ఐకెపి విఓఏలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈనెల 16 నుంచి 26 వరకూ ఐకేపీవీఓఏఏ సెంటర్ నుంచి గ్రామ, మండల స్థాయి వరకూ ప్రచారం ఉధృతంగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, ఐకేపీ వీఓఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం. నగేష్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్కుమార్, కోశాధికారి సుమలత, రమేష్, వి. వెంకటయ్య, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.