Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘటన
నవతెలంగాణ -మునుగోడు
తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతు పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది. చల్మెడ గ్రామానికి చెందిన గాదెపాక సైదులు సర్వే నెంబర్ 181లో 32 గుంటల ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నాడు. దాన్ని పట్టా చేయాలని తహసీల్దార్ను కోరాడు. అయితే, తనకు పట్టా చేసేందుకు నిబంధనల సాకు చెప్పి.. గ్రామంలోని ఇతర రైతులకు ఎలా పట్టా చేశారని సైదులు ప్రశ్నించారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయానికొచ్చి పెట్రోల్ మీద పోసుకోగా.. అక్కడున్నవారు అడ్డుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితుని పోలీస్టేషన్కు తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైతు సైదులుపై కేసు నమోదు చేసినట్టు మునుగోడు ఎస్ఐ సతీష్ రెడ్డి తెలిపారు.
ఈ విషయంపై తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాస్ను 'నవతెలంగాణ' వివరణ కోరగా.. ధరణి పోర్టల్లో ప్రభుత్వ భూములను పట్టా చేసే అధికారం తమకు లేదని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.