Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీఎస్యూటీఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఏప్రిల్ చివరి వారంలో పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి మంగళవారం హైదరాబాద్లో కలిసి వినతిపత్రం సమర్పించారు. జేఈఈ మెయిన్ తొలివిడత పరీక్షల షెడ్యూల్ సవరణ దృష్ట్యా ఇంటర్మీడియెట్ పరీక్షలు ఆలస్యమయ్యేపక్షంలో తొలుత పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని కోరారు. వేసవికాలంలో అధిక వేడి కారణంగా హైస్కూల్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. దీంతో మే 11 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించాలని కోరారు. ఆరు పేపర్లే కాబట్టి ఏప్రిల్ 25 నుంచి 30 వరకు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.