Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 1,218 మంది అవర్లీ బేస్డ్ టీచర్లకు ప్రభుత్వం వేతనాలు పెంచింది. పీఆర్సీ ప్రకారం 30 శాతం వేతనాలు పెంచుతున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం వారి వేతనాలు రూ.140 ఉన్నాయనీ, దాన్ని 30 శాతం చొప్పున రూ.182కు పెంచామని వివరించారు. వేతనాలు పెంచడం పట్ల టీఎంఎస్టీఏ అధ్యక్షులు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కె నగేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.