Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష వచ్చేనెల 17న జరగనుంది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరో తరగతి, మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు ఏడు నుంచి పదో తరగతి వరకు దరఖాస్తు చేసిన విద్యార్థులకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.