Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొగుట
పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం కనుగల్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కర్ణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముచ్చెర్ల కనకయ్య (38) హైదరాబాద్లో జీవించేవాడు. అయితే కొన్నేండ్ల కిందట స్వగ్రామానికి వచ్చి తనకున్న 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాగా పెట్టుబడి, కుటుంబ పోషణకు రూ.2 లక్షల వరకు అప్పులు చేశాడు. అనుకున్న స్థాయిలో దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై తన వ్యవసాయ భూమి వద్ద గురువారం రాత్రి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తల్లి బూదవ్వ ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి శవాన్ని సిద్దిపేట ఏరియాస్పత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు.