Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపరీక్ష ఫలితాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ సోమవారం హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలో ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీలు 30, ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలు 15, ఎస్టీ బాలుర డిగ్రీ కాలేజీలు 7, మొత్తం 52 డిగ్రీ కాలేజీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రవేశాల కోసం ఇటీవల ఉమ్మడి ప్రవేశ పరీక్ష ( టీజీయూజీసెట్-2022) నిర్వహించినట్టు గుర్తుచేశారు. పరీక్షకు 18,498 మంది అమ్మాయిలు హాజరు కాగా,14,201 మంది (85%), 2,495 మంది బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఇందులో అర్చన అనే అమ్మాయి మొదటి ర్యాంకు సాధించారు. ఈ పరీక్షలో ఆమెతో పాటు ఉత్తీర్ణత సాధించిన వారందరిని మంత్రి, ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్లు అభినందించారు. ఎస్సీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలు షషష.్రషతీవఱర.aష.ఱఅ, ఎస్టీ గురుకులాలకు సంబంధించిన ఫలితాలను https://tgtwgurukulam.telangana.gov.in అనే వెబ్ సైట్ల ద్వారా పొందవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు హన్మంతు నాయక్, ఎం.ప్రవీణ్, ప్రమోద్ కుమార్, శర్మ తెలిపారు.