Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ జోగినపల్లి సంతోశ్కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహబూబ్నగర్ జిల్లాలోని కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో మినీ జూ ఏర్పాటు కోసం తన ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్కుమార్ ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని బేగంపేటలోని టూరిజం ప్లాజా హౌటల్లో విత్తన బంతులతో అతిపెద్ద వాక్యం తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడంలో భాగస్వామ్యులైన వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ అంకిత మిచ్చారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, డీఆర్డీఓ యాదయ్య, పూర్వపు మెప్మా పిడి శంకరాచారి, డీఐఓ సత్యనారాయణ మూర్తి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఏపీడీ శారద, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సురేఖ, ఎఫ్ఆర్వో రంజిత్, డీపీఎం నాగమల్లిక, చెన్నయ్య ,అనిల్, సుదర్శన్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.