Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణాలను సైతం ఆయన లెక్కచేయలేదు : చుక్కరాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భగత్సింగ్ స్ఫూర్తితో కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపైనా, మతోన్మాదంపైనా నేటి తరం పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో భగత్సింగ్ 91వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాములు మాట్లాడుతూ.. నూనుగు మీసాల వయస్సులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదుల కబంధ హస్తాల నుంచి దేశాన్ని కాపాడటం కోసం ఉరికంబం ఎక్కిన గొప్ప త్యాగశీలి భగత్సింగ్ అని కొనియాడారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ.రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. శ్రీకాంత్, వై. సోమన్న, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు.