Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.నాలుగు వేలతో గురువారం నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశముందని తెలిపారు.