Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 30 నాటికి ప్రవేశాలు పూర్తి చేయాలి
- ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త విద్యాసంవత్సరంలో తరగతులు ప్రారంభమవుతాయని అఖిల సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీటీఈ సభ్యకార్యదర్శి రాజీవ్ కుమార్ అకడమిక్ క్యాలెండర్ను బుధవారం విడుదల చేశారు. జులై 30వ తేదీ నాటికి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. మేలో ప్రవేశ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. జూన్ ఐదో తేదీ నాటికి ఫలితాలు ప్రకటించాలని కోరారు. అదేనెల 30లోగా తొలివిడత జులై పదిలోపు రెండో విడత, 20లోపు తుదివిడత ప్రవేశాల ప్రక్రియను చేప ట్టాలని తెలిపారు. అదేనెల 30లోగా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆగస్టు 15 నాటికి మిగిలిపోయిన సీట్లలో విద్యార్థులు చేరేందుకు అవకాశముందని తెలిపారు.