Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో కేంద్రం వాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్ కేటాయింపులపై డిపార్ట్మెంటల్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీవోపీటీ)దే పూర్తి అధికారమని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్రెడ్డి ఇదే విషయాన్ని హైకోర్టుకు విన్నవించారు. ఏపీ విభజన తర్వాత అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులకు ఐదుగురు సభ్యులతో వేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకే ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపులు జరిగాయన్నారు. చీఫ్ సెక్రటరీగా చేస్తున్న సోమేష్కుమార్ను ఏపీకి కేటాయించటంపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)లో సవాల్ చేసి మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారనీ, అందువల్ల క్యాట్ ఆదేశాల్ని కొట్టేయాలని కోరారు. ఆయన్ను ఏపీకి కేటాయించాలని కోరారు. ఆ రాష్ట్రానికి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగడం చెల్లదన్నారు. శుక్రవారం కూడా వాదనలు కొనసాగనున్నాయి.