Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కె నాగేశ్వర్రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రోస్టర్ విధానంలో వికలాంగులకు అన్యాయం జరుగుతున్నదని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూడు శాతం నుంచి నాలుగు శాతం రోస్టర్ని వెంటనే ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం మూడు శాతం నుంచి నాలుగు శాతం రిజర్వేషన్ను పెంచుతున్నట్టుగా రెండేండ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని గుర్తుచేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు ఉద్యోగాల భర్తీ కోసం నాలుగు శాతం భర్తీ చేస్తామని ప్రకటించిందని తెలిపారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన రోస్టర్ విధానంలో కేవలం మూడు శాతం ప్రకటించటం అన్యాయమని పేర్కొన్నారు.