Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ ప్రమాణాలతో 178 ఎకరాలలో కోహెడ పండ్ల మార్కెట్ నిర్మిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద ఢిల్లీ ఆజాద్ పూర్ మండీ ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయాన్ని పొందుతున్నదని చెప్పారు. 1975లో 90 ఎకరాలలో నిర్మాణమైందని తెలిపారు.ఆజాద్ పూర్ మండీలో పండ్లు, కూరగా యలు, పసుపు మార్కెటింగ్ విధానాన్ని పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి తదితరులు ఉన్నారు.