Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బక్కని నర్సింహులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దిసోత్సవం మంగళవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్భవన్లో మంగళవారం నిర్వహించనున్నట్టు టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్. చంద్రబాబునాయుడు హాజరుకానున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీఆర్ట్రస్ట్ భవన్లో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషాచేస్తామని చెప్పారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని వివరించారు. విలేకర్ల సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోత్స్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీరానాయక్, గన్నోజు శ్రీనివాసాచారీ, రాష్ట్ర అధికార ప్రతినిధులు బాలసుబ్రమణ్యం, మ్యాడం రామేశ్వర్రావు పాల్గొన్నారు.