Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజస్థాన్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేశారనీ, మన రాష్ట్రంలోనూ రద్దుచేయాలని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉపాధ్యాయ, ఉద్యోగ, సంఘం-తెలంగాణ రాష్ట్రం(సీపీఎస్టీఈఏ టీఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు, అధ్యక్షులు డి.కమలాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పదేండ్లుగా వినతులు ఇస్తున్నా..నిరసన కార్యక్రమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలని కోరారు.