Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మార్చిలోనే మాడపగిలేలా ఎండలు కొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు, ఉక్కపోత రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రానున్న వారం రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లా చాప్రాలలో అత్యధికంగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ ప్రతాపం ఎక్కువగా ఉంది. విదర్భ నుంచి ఇంటీరియల్ కర్నాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.