Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ ఏర్పడి మంగళవారంతో 40 ఏండ్లు పూర్తవుతున్నాయి. ఈమేరకు టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు ఆపార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్కు పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్.చంద్రబాబునాయుడు రానున్నారు. 1982 మార్చి 29న ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో టీడీపీ ఏర్పాటు చేస్తున్నట్టు పార్టీ వ్యవస్ధాపకులు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా చంద్రబాబు జెండాను ఆవిష్కరిస్తారు.