Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కౌన్సిల్ ఫర్ నర్తరింగ్ అకడమిక్ పొటెన్షియల్ ఇన్ స్టూడెంట్స్ (సినాప్స్) ఒలింపియాడ్లో నారాయణ విద్యార్థులు చరిత్రను తిరగరాశారు. అత్యధిక సంఖ్యలో 64.5 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పి సింధూర నారాయణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన సినాప్స్-2021 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారని వివరించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మొదటి పదిలోపు 61 ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారని తెలిపారు. రెండు, ఐదు, ఆరు, ఎనిమిది తరగతుల్లో మొదటి ర్యాంకులతోపాటు రెండు, మూడు, ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల్లో రెండో ర్యాంకును సాధించి చరిత్ర సృష్టించారని వివరించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యాథ్స్ ఒలింపియాడ్ను ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా నారాయణ విద్యార్థులు రికార్డు స్థాయిలో 43,587 (64.5 శాతం) మంది విద్యార్థులు విజయాన్ని పొందారని పేర్కొన్నారు. స్కూల్ స్థాయి పోటీపరీక్షల్లో విజయం కోసం ప్రత్యేకంగా సీవో స్పార్క్, ఒలింపియాడ్, ఈటెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్లతో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.