Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 నుంచి పీజీఈసెట్ దరఖాస్తులు షురూ
- నోటిఫికేషన్లు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్, ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం హైదరాబాద్లో వాటి పూర్తి సమాచారంతో కూడిన షెడ్యూల్ను ప్రకటించారు. వచ్చేనెల ఆరో తేదీ నుంచి ఆన్లైన్లో ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా వాటి సమర్పణకు జూన్ 27వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు రూ.450, ఇతరులు రూ.650 ఫీజు చెల్లించాలని సూచించారు. ఆలస్య రుసుం రూ.250తో జులై 11 వరకు, రూ.500తో 18 వరకు, రూ.వెయ్యితో 23 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని తెలిపారు. అదేనెల 18 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోచ్చని సూచించారు. జులై 13 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తుల్లో వివరాలను సరిచేసుకునేందుకు అవకాశముందని వివరించారు. జులై 27న ఒక విడత, 28న రెండు విడతల్లో రాతపరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నాలుగో తేదీన ప్రాథమిక కీని విడుదల చేస్తామని తెలిపారు. 22న ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. ఇతర వివరాలకు https://icet.tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. పీజీఈసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వచ్చేనెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు రూ.500, ఇతరులు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆలస్య రుసుం లేకుండా జూన్ 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశముందని సూచించారు. ఆలస్య రుసుం రూ.250తో అదేనెల 30 వరకు, రూ.వెయ్యిలో జులై 10వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించొచ్చని తెలిపారు. జులై 29 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు రాతపరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇతర వివరాలకు http://pgecet. tsche.ac.in లేదా http://www.tsche.ac.inవెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కేయూ వీసీ టి రమేష్, ఐసెట్ కన్వీనర్ కె రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.