Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వెల్గటూర్
అప్పులు బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గొడిశాలపేట గ్రామానికి చెందిన రైతు ఏనుగు మల్లారెడ్డి అలియాస్ స్వామిరెడ్డి(54) కొంత కాలం కింద చేపట్టిన ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అవి ఎలా తీర్చాలో పాలుపొక నిత్యం మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం తన వ్యవసాయం భూమిలో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న స్వామిరెడ్డి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు.