Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి, డీజీపీకి టీడబ్ల్యూజేఎఫ్ వినతి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
జర్నలిస్టుల వాహనాలపై ఉండే 'ప్రెస్' స్టిక్కర్లను పోలీసులు తొలగించడం నిలిపేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్యతో కూడిన ప్రతినిధి బందం హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ను కలిసి వినతి పత్రాలు సమర్పించింది. జంట నగరాల్లో ఇటీవల పోలీసులు ప్రెస్ స్టిక్కర్లపై జర్నలిస్టులకు చలాన్ విధిస్తున్నారనీ హోంమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషియరీ, ప్రెస్ నాలుగు స్తంభాలన్న విషయం తెలిసిందేనని చెప్పారు. జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్నారనీ, వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. రాజ్యాంగం ఫోర్త్ ఎస్టేట్కు గుర్తింపును ఇచ్చిందనీ, ఇందులో భాగంగా పాత్రికేయులు తమ వాహనాలకు ప్రెస్ అనే స్టిక్కర్ పెట్టుకోవడం వారి వత్తి నైతికతకు, ఉన్నత ప్రమాణాలకు గౌరవంగా భావిస్తారని గుర్తు చేశారు. అయితే ఈ మధ్య పోలీసులు జర్నలిస్టుల వాహనాలపై ప్రెస్ అనే స్టిక్కర్ను తొలగించి అవమానిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులు ఈ ప్రెస్స్టిక్కర్ను వాహనాలకు పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నారనే నెపంతో వర్కింగ్ జర్నలిస్టులను పోలీసులు ఇబ్బంది పెట్టడం సరైంది కాద చెప్పారు. నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదనీ, కానీ ఆ పేరుతో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న నిజమైన జర్నలిస్టులను అనుమా నించడం,అవమానించడం సరికాదన్నారు.దీనిపై హోంమంత్రి మహమూ ద్ అలీ స్పందిస్తూ పోలీస్ అధికారులతో మాట్లాడి నిజమైన జర్నలిస్టుల కు సహకరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టులను ఏరివేత కోసమే వాహనాలపై ప్రెస్ స్టిక్కర్ల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు లేదా గుర్తింపు పొందిన మీడియా సంస్థల ఐడీ కార్డు తప్పనిసిరిగా ఉండాలని చెప్పారు. జర్నలిస్టులు కానివారంతా తమ వాహనాలకు ప్రెస్ స్టిక్కర్లను వారే స్వచ్చందంగా తొలగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. ఆనందం, కోశాధికారి ఆర్ వెంకటేశ్వర్లు,నాయకులు విజయానందరావు తదితరులు పాల్గొన్నారు.