Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మాజీ ఎంపి బాసుదేవ్ ఆచార్య డిమాండ్.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సికింద్రాబాద్ బోయిగూడలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సీపీఐ(ఎం) మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టకూటి కోసం వలస వచ్చి అగ్నికి ఆహుతై మరణించిన బీహార్ రాష్ట్రం, చాప్రా జిల్లాకు చెందిన 11 మంది వలస కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.5 లక్షల సహాయం ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా, 11 మంది కార్మికుల మృతికి కారణమైన శ్రావణి ట్రేడర్స్ గోడౌన్ యజమాని సంపత్పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.