Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ శుక్రవారం హైదరాబాద్లోని ఫిలింనగర్లో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ నివాళులర్పించారు.హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,యన్. భాస్కర్ రావు తదితరులు స్వరాజ్యం త్యాగనిరతిని స్మరించుకున్నారు.