Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మిర్యాలగూడ పట్టణంలో సంచలనం సృష్టించిన ప్రణరు హత్య కేసు నిందితుడు అబ్దుల్బారికి శనివారం గుండెపోటు వచ్చింది. అధికారులు వెంటనే నిమ్స్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిసింది. ప్రణరు హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావుకు సుఫారీ గ్యాంగ్ను అబ్దుల్బారి సమకూర్చారు. అతన్ని పది రోజుల కిందట సాదారణ చెకప్లో భాగంగా ఉస్మానియాకు.. అక్కడి నుంచి గాంధీకి.. ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అబ్దుల్బారి గుండెకు సంబంధించిన వైద్యాన్ని ప్రణరు హత్యకు ముందు నుంచే తీసుకుంటున్నారని జైలు అధికారులు ధృవీకరించారు. గతంలో చంచల్గూడ జైలులో ఉన్న అతన్ని జిల్లా కేంద్రంలో కేసుల విచారణ జరుగుతున్న దృష్ట్యా జిల్లా జైలుకు తీసుకొచ్చారు.